నవతెలంగాణ హైదరాబాద్: బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ శనివారం మరోసారి సమన్లు జారీ చేసింది. రైల్వే ఉద్యోగాల భర్తీకి సంబంధించిన కుంభకోణంలో విచారణకు రావాలని ఈడీ ఆదేశించింది. జనవరి 5న హాజరు కావాలని కోరింది. మరో వైపు విదేశాలకు వెళ్లాలని ఉందంటూ దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు విచారణకు స్వీకరించింది. వచ్చే ఏడాది జనవరి 6 నుంచి 18 వరకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వెళ్లేందుకు ఉప ముఖ్యమంత్రి కోర్టును ఆశ్రయించారు. ఇంతకు ముందు ఇదే కేసులో ఈ నెల 27న మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ను ఆదేశించిన విషయం తెలిసిందే.