యూపీఎస్సీ అభ్యర్థులకు ఉచిత అవగాహన తరగతులు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
యూపీఎస్సీ-2024కు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు వారంరోజులపాటు ఉచిత అవగాహన తరగతులను ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో నిర్వహించనున్నట్టు 21వ సెంచరీ ఐఏఎస్‌ అకాడమి ప్రకటించింది. ఈనెల 28న ఆదివారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో ఉన్న 21వ సెంచరీ ఐఏఎస్‌ అకాడమి సెమినార్‌ హాల్‌లో తరగతులను ప్రారంభిస్తామని ఆ అకాడమి నిర్వాహకులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో ఎన్‌సీఈఆర్టీ, జీఎస్‌, ఆప్షనల్‌ ఎంపిక, న్యూస్‌ పేపర్‌ ఎనాలసిస్‌ వంటి అంశాలపై విశ్లేషణాత్మక తరగతులను నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రముఖ విద్యావేత్త, వ్యక్తిత్వ వికాస నిపుణులు ఆకెళ్ల రాఘవేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించే ఈ అవగాహన తరగతుల్లో పలువురు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు, సీనియర్‌ అధ్యాపకులు పాల్గొంటారని వివరించారు.

Spread the love