సివిల్స్‌లో ‘శ్రీ సాయి హర్షిత్‌’కు 40వ ర్యాంకు

– మండల, గ్రామ ప్రజా ప్రతినిధుల హర్షం
నవతెలంగాణ-చిట్యాల
జయశంకర్‌-భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం గుంటూరుపల్లి గ్రామానికి చెందిన శాఖమూరి శ్రీ సాయి హర్షిత్‌ సివిల్స్‌లో ఆల్‌ ఇండియా లెవెల్‌లో 40వ ర్యాంకు సాధించి తెలంగాణ రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచి తన ప్రతిభ చాటి మండల కీర్తిని చాటాడు. మంగళవారం శాఖ మూరి శ్రీసాయి హర్షిత్‌ను మండల, గ్రామ ప్రజాప్రతి నిధులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు. కాగా శ్రీ సాయి హర్షిత్‌ గుంటూరు పల్లి గ్రామానికి చెందిన శాఖ మూరి పద్మజ అమర్‌ దంపతులకు రెండవ కుమారుడు. పదవ తరగతి వరకు వరంగల్‌ పబ్లిక్‌ స్కూల్‌లో చదివాడు. హైదరాబాద్‌లోని శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్‌ విద్య పూర్తి చేసుకున్నాడు. అనంతరం బిట్స్‌ పిలాని రాజస్థాన్‌లో బీటెక్‌ పూర్తి చేసినట్లు బంధువులు తెలిపారు. అనంతరం సివిల్స్‌పై దృష్టి సారించిన శ్రీ సాయి హర్షిత్‌ కష్టపడి చదివి 2022 యూపీఎస్సీ ఫలితాల్లో ఫస్ట్‌ అటెం ప్ట్‌ లోనే ఆల్‌ ఇండియా 40 ర్యాంకు, తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించి మండల,గ్రామ కీర్తిని చాటినట్లు పలువురు హర్షం వ్యక్తం చేశారు. చిన్న వయసులో సివిల్స్‌ లో ర్యాంకు సాధించిన శ్రీ సాయి హర్షిత్‌ ను తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు శ్రీ సాయి హర్షిత్‌ కు అభినందనలు తెలిపారు.

Spread the love