బీజేపీ నుండి కాంగ్రెస్ లోకి

నవతెలంగాణ- రామారెడ్డి:  మండల కేంద్రానికి చెందిన బీజేపీ యువమోర్చా ప్రధాన కార్యదర్శి బైండ్ల వేణు సోమవారం బీజేపీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మదన్ మోహన్ రావు చేస్తున్న సేవలు, ఉద్యమకారుడు లక్ష్మా గౌడ్ కాంగ్రెస్లో చేరటంతో, ఆదర్శంగా తీసుకొని పార్టీలో చేరినట్లు తెలిపారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల లక్ష్మణ్, సొసైటీ డైరెక్టర్ లక్ష్మా గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంబాయి ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
Spread the love