- Advertisement -
నవతెలంగాణ-ఆలేరు టౌను
ఆలేరు పోలీస్ స్టేషన్ నూతన స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ)గా జి. ఉదయ్ కిరణ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు ఆలేరు ఎస్హెచ్ఓగా విధులు నిర్వహించిన డి. యాలాద్రి బదిలీపై వెళ్లడంతో ఆయన స్థానంలో జి. ఉదయ్ కిరణ్ నియమితులయ్యారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం పోలీసు అధికారులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటానని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా జి. ఉదయ్ కిరణ్ తెలిపారు. ప్రజలు పోలీసు శాఖకు సహకరించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా పలువురు వారిని శాలువాతో ఘనంగా సన్మానించారు.
- Advertisement -



