గడ్డం వంశీకృష్ణ గెలుపునకు కలిసికట్టుగా కృషి చేయాలి

– బీఆర్ఎస్, బీజేపీ లకు బుద్ది చెప్పాలి
– శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిళ్ల శ్రీనుబాబు
నవతెలంగాణ – మల్హర్ రావు
పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపునకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతిఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర ఐటి,పరిశ్రమల,శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాను సోదరుడు,శ్రీపాద ట్రస్ట్ చైర్మన్, కాంగ్రెస్ రాష్ట్ర యువ నాయకుడు దుద్దిళ్ల శ్రీనుబాబు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మండల మల్హర్,కాటారం మండలాల్లో కాంగ్రెస్ కార్యకర్తలతో భారీగా బైక్ ర్యాలీలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్నర్ సమావేశాల్లో శ్రీనుబాబు మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి బీఆర్ఎస్, బీజేపీలకు బుద్ధి చెప్పాలన్నారు.కాంగ్రెస్‌ పార్టీ పాంచ్ న్యాయ్ గ్యారంటీలను ప్రకటించందన్నారు.అందులో రైతులకు, యువకులకు, నిరుద్యోగులకు, కార్మికులకు, మహిళలకు పెద్దపీట వేసిందన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ నాయకులకు దిశ,నిర్దేశం చేశారు.ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి వంశీ మాట్లాడారు స్వర్గీయ శ్రీ పాద రావు జీవితం స్ఫూర్తిదాయకమన్నారు. స్వర్గీయ శ్రీపాద రావు, కాక వెంకటస్వామి చాలా మంచి స్నేహితులన్నారు.మీ అందరి ఆశీర్వాదంతో నన్ను గెలిపించాలని ప్రజలని కోరారు.తనకు ఒక్క అవకాశమిస్తే యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ చింతలపల్లి మల్హర్ రావు,భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ ఎస్సిసెల్ అధ్యక్షుడు దండు రమేష్,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడితేల రాజయ్య, యూత్ అధ్యక్షుడు గడ్డం క్రాoతి,జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు సవేందర్, జిల్లా మత్స్యశాఖ డైరెక్టర్ జంగిడి శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ కొండ రాజమ్మ, సింగిల్ విండో వైస్ ఛైర్మన్ మల్కా ప్రకాష్ రావు,డైరెక్టర్లు ఇప్ప మొoడయ్య, వొన్న తిరుపతి రావు,నాయకులు కేశారపు చెంద్రయ్య, ఇందారపు చెంద్రయ్య,కుంట సది,మేనం సతీష్, జంగిడి సమ్మయ్య,శ్రీదర్,లింగయ్య,యూత్ నాయకులు బొబ్బిలి రాజు,కేశారపు సురేందర్,తిర్రి అశోక్, సాత్విక్,లింగన్న పేట రమేష్,కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు,కార్యకర్తలు  పాల్గొన్నారు.
Spread the love