తెలుగు చిత్ర సీమ 90 ఏళ్ల ప్రయాణాన్ని నవతిహి ఉత్సవంగా ఘనంగా నిర్వహించేందుకు మలేషియా వేదిక కానుంది. ఈ కార్యక్రమం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)ప్రెసిడెంట్ విష్ణు మంచు ఆధ్వర్యంలో ఘనంగా జరగనుంది. కౌలాలంపూర్లోని బుకిట్ జలీల్లోని ప్రతిష్టాత్మక నేషనల్ స్టేడియంలో జూలై 20న ఈ వేడుకని అత్యంత వైభవంగా నిర్వహించబోతున్నారు. ఈ వేడుకలో సినిమా రంగానికి చెందిన అతిరథులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఈ వేడుక ప్రాముఖ్యతను వివరించడంతోపాటు దీనికి ప్రోత్సాహకరంగా నిలుస్తున్న భాగస్వాములను అందరినీ పరిచయం చేస్తూ సన్వే పిరమిడ్, సన్వే రిసార్ట్లో ప్రత్యేక సమావేశం జరిగింది. మూడు దేశాల నుండి వచ్చిన ప్రతిపాదనలను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత ఈ ప్రతిష్టాత్మకమైన ఈవెంట్ను మలేషియాలో నిర్వహించడం ఉత్తమమని నిర్ణయం తీసుకున్నారు. మలేషియా టూరిజం, మా, స్థానిక ఈవెంట్ ఆర్గనైజర్ ఎంసి ఎంటర్టైన్మెంట్ భాగస్వామ్యంతో ఈ గ్లోబల్ వేడుకను ఘనంగా నిర్వహించబోతున్నారు. నవతిహి ఉత్సవం కేవలం సినిమా విజయాలకు వేడుక మాత్రమే కాదు. మలేషియా ప్రజలు, తెలుగు మాట్లాడే వర్గాల మధ్య పరస్పర అవగాహన, గౌరవాన్ని పెంపొందించే సాంస్కతిక మార్పిడికి చిహ్నంగా ఈ ఈవెంట్ జరగనుందని ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు తెలిపారు.