బాలీవుడ్ హీరో ఆయుష్ శర్మ నటిస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘రుస్లాన్’. కరణ్ బి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. సుశ్రీ మిశ్రా హీరోయిన్. ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మాత కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్గా మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్ని నిర్వహించింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన రచయిత విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ,’ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందో చెప్పలేకపోతున్నాను. అంత అద్భుతంగా ఉంటుంది. ఆయుష్ ఇందులో ఎక్స్ట్రార్డినరీగా చేశాడు. రాధామోహన్ చాలా ప్యాషన్ ఉన్న నిర్మాత. ఈ సినిమాని చాలా అద్భుతంగా నిర్మించారు. జగపతిబాబు ప్రజెన్స్ సినిమాని మరింత ప్రత్యేకంగా నిలుపుతుంది’ అని తెలిపారు. ‘ఈ సినిమా నాకు చాలా స్పెషల్. ఇందులో నేను చాలా డిఫరెంట్ డైమెన్షన్ ఉన్న పాత్ర చేస్తున్నాను. ఇది నా రెండో హిందీ చిత్రం’ అని జగపతి బాబు చెప్పారు. హీరో ఆయుష్ శర్మ మాట్లాడుతూ,’ఈ సినిమా తప్పకుండా మా అందరికీ గొప్ప విజయాన్ని చేకూర్చుతుందని నమ్ముతున్నాను’ అని చెప్పారు. ‘హిందీలో ఇది మా మొదటి సినిమా. అవుట్ పుట్ అద్భుతంగా వచ్చింది. ఎమోషన్, యాక్షన్, మంచి డైలాగ్స్, అందమైన విజువల్స్తో గొప్ప థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే సినిమా ఇది’ అని నిర్మాత కెకె రాధామోహన్ తెలిపారు.