నవతెలంగాణ – ఖమ్మం
ఖమ్మం జిల్లాలో జేఎన్టీయూ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఇందుకు సంబంధించిన ఫైలుపై సీఎం కేసీఆర్ శుక్రవారం సంతకం చేశారు. ఈ విషయాన్ని జేఎన్టీయూ వీసీ కట్టా నర్సింహారెడ్డికి పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్రెడ్డి ఫోన్ ద్వారా తెలియజేశారు. ఖమ్మం నగరానికి ఆరు కిలోమీటర్ల దూరంలో కళాశాల ఏర్పాటుకు ఇప్పటికే స్థలాన్ని సేకరించారు. 2023-24లో కళాశాల ప్రారంభం కానుండగా, ప్రత్యేక కౌన్సెలింగ్ ద్వారా అడ్మిషన్లు కల్పించనున్నారు.