గంజాయి మత్తులో ఆరేళ్ల బాలుడిపై లైంగిక దాడి

నవతెలంగాణ – గుంటూరు: గంజాయి మత్తులో ఆరేళ్ల బాలుడిపై లైంగిక దాడి చేసిన సంఘటన గుంటూరు జిల్లా పొన్నూరులో చోటు చేసుకుంది. బాధిత కుటుంబీకుల వివరాల మేరకు.. బాలుడు స్థానికంగా ప్రైవేటు పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. శుక్రవారం పాఠశాల ముగిశాక ఇంటి ఆవరణలో ఆడుకుంటున్నాడు. అటుగా వచ్చిన నాగిశెట్టి పవన్‌ సంజయ్‌ (20) గంజాయి మత్తులో బాలుడిని గదిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలుడు కేకలు వేయడంతో చుట్టుపక్కలవాళ్లు గమనించి అక్కడికివచ్చి అతడికి దేహశుద్ధి చేశారు. కుటుంబసభ్యులు అర్బన్‌ పోలీసులకు సమాచారమిచ్చారు. వారు నిందితుడిని అదుపులోకి తీసుకుని పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాలుడిని పొన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Spread the love