నవతెలంగాణ-హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు నిరసన సెగ తగిలింది. కరీంనగర్ నుంచి సిరిసిల్లకు బస్సులో వెళ్తుండగా మానేరు ముంపు నిర్వాసితులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కొదురుపాక వద్ద ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. రాజన్న సాక్షిగా ముప్పు గ్రామాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. దీంతో కొంత సేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.