నవతెలంగాణ-కొండమల్లేపల్లి
రైస్ మిల్లులకు వచ్చే ఐకెపి ధాన్యాన్ని మిల్లర్లు వెంటనే దిగుమతి చేసుకొని లారీలను కొనుగోలు కేంద్రాలకు పంపించాలని అదనపు కలెక్టర్ భాస్కర్రావు అన్నారు. ఆదివారం కొండమల్లేపల్లి మండల పరిధిలో ఉన్న సాయి లక్ష్మి, సాయి బాలాజీ, సాయి వెంకటేశ్వర, శ్రీ గణేష్, వంటి రైస్ మిల్లులను పరిశీలించి దాన్యం దిగుమతుల గురించి మిల్లర్లను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభం అవుతున్నందున మిల్లర్లు ఆలస్యం చేయకుండా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా వచ్చిన ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకొని లారీలను ఐకెపి కొనుగోలు కేంద్రాలకు పంపించాలని సూచించారు. ఆయన వెంట ఆర్డిఓ గోపి రామ్, తహసీల్దార్ దేవదాస్, అరుణ, పౌరసరఫరాల డిప్యూటీ తహసీల్దార్ హనుమంతు, శ్రీనివాస్ గౌడ్, పిఎసిఎస్ చైర్మన్ వేణుధర్రెడ్డి, రెవెన్యూ సిబ్బంది తదితరులు ఉన్నారు.