దిద్దగుంట్ల నారాయణరెడ్డికి జోహార్లు

నేరేడుచర్ల: సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు, అమరజీవి దిద్దగుంట్ల నారాయణరెడ్డి పదోవర్థంతిని సీపీఐ(ఎం) పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నేరేడుచర్లలోని అరిబండి భవన్‌లో నిర్వహించారు.ఆయన చిత్రపటానికి సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గసభ్యులు పారేపల్లి శేఖర్‌రావు పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారాయణరెడ్డి హుజూర్‌నగర్‌ తాలూకాలో కమ్యూనిస్టు పార్టీ అభివద్ధికి ఎంతో కృషి చేసిన గొప్ప నాయకులన్నారు.వ్యవసాయ కార్మికసంఘం నాయకుడిగా, రైతుసంఘం నాయకుడిగా ఈ ప్రాంతంలో వారి హక్కుల సాధన కోసం పోరాడారన్నారు.ముఖ్యంగా కృష్ణపట్టె ప్రాంతంలో పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశారన్నారు. సీపీఐ(ఎం) మండల కార్యదర్శిగా, డివిజన్‌ కమిటీ సభ్యుడిగా పనిచేసిన గొప్ప నాయకుడన్నారు.ఎన్ని ఒడుదుడుకులొచ్చినా తన ఆశ యం కోసం చివరి వరకు పార్టీలో ఉండి అనారోగ్యంతో మరణించడం ఈ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటన్నారు.ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పని చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ కార్యదర్శి కొదమగుండ్ల నగేష్‌,పట్టణ కమిటీ సభ్యులు కుంకు తిరుపతయ్య, ఆనిగంటి మీనయ్య, కొండపల్లి వరలక్ష్మీ, ఎడ్ల సైదులు, నీలారామ్మూర్తి, మోషం నర్సింహ,తాడోజు శ్రీను, గుర్రం ఏసు, శ్రీను, లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.

Spread the love