నవతెలంగాణ – హైదరాబాద్: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో జోక్యం చేసుకునేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ఈ నెల 11న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించవద్దని తాజాగా మరో అభ్యర్థి పిటిషన్ దాఖలు చేశారు. గతంలో గైర్హాజరైన అభ్యర్థులను అనుమతించొద్దని కోరారు. ప్రశ్నాపత్రం లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలని న్యాయస్థానాన్ని కోరారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం దర్యాప్తును సీబీఐకి ఇవ్వాలన్న ఇతర పటిషన్లతో జరపరచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. 2022 ఏప్రిల్ 26న 503 పోస్టులతో తెలంగాణ తొలి గ్రూప్-1 ప్రకటనను టీఎస్పీఎస్సీ వెలువరించింది. రాష్ట్రవ్యాప్తంగా 3,80,202 మంది దరఖాస్తు చేసుకున్నారు. అక్టోబరు 16న ప్రిలిమినరీ నిర్వహించగా 2,85,916 మంది రాశారు. పేపర్ లీకేజీ కారణంతో ఈ పరీక్షను రద్దు చేశారు.