నవతెలంగాణ – హైదరాబాద్ : చాలా కాలంగా ఇండియా – కువైట్ దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. దాదాపుగా 10 లక్షల మంది భారతీయులు కువైట్ దేశంలో పని చేస్తున్నారు. మరోవైపు కువైట్ లో తొలిసారి హిందీ రేడియో ప్రసార కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. దీనిపై భాతర రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా స్పందిస్తూ సంతోషాన్ని వ్యక్తం చేసింది. ప్రతి ఆదివారం రాత్రి 8.30 నుంచి 9 గంటల వరకు ఎఫ్ఎం 93.3, ఎఫ్ఎం 96.3 ఫ్రీక్వెన్సీల్లో హిందీ కార్యక్రమాలు ప్రసారమవుతాయని తెలిపింది. హిందీ కార్యక్రమాలను ప్రసారం చేయడంపై కువైట్ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖపై భారత రాయబార కార్యాలయం ప్రశంసలు కురిపించింది.