తీహార్ జైలు అధికారులు అబద్దం చెప్తున్నారు : కేజ్రీవాల్

నవతెలంగాణ- ఢిల్లీ : తనకు రోజూ ఇన్సులిన్ ఇంజక్షన్లు కావాలంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలు సూపరింటెండెంట్‌‌కు లేఖ రాశారు. మద్యం పాలసీ కేసులో అరెస్టయిన కేజ్రీవాల్ తీహార్ జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. తనకు షుగర్ లెవల్స్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రతిరోజు ఇన్సులిన్ తీసుకోవడానికి అనుమతి కోరుతున్నానని పేర్కొంటూ సోమవారం ఈ లేఖను రాశారని ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యమంత్రి ఆరోగ్యంపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని ఎయిమ్స్ వైద్యులు చెప్పినట్లుగా జైలు అధికారులు తెలియజేపయడాన్ని ఆయన తోసిపుచ్చారు. జైలు అధికారులు రాజకీయ ఒత్తిడి కారణంగా అబద్ధం చెప్పారని జైలు సూపరింటెండెంట్‌కు రాసిన లేఖలో కేజ్రీవాల్ ఆరోపించారు. జైల్లో వార్తాపత్రికలను చదివిన తర్వాత అధికారులు చెప్పిన విషయం విని బాధపడ్డానని కేజ్రీవాల్ ఆ లేఖలో తెలిపినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ తెలిపింది.

Spread the love