ఏనుగు ఎక్కిన మోడీ

నవతెలంగాణ హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోడీ (PM Modi) ఏనుగు ఎక్కి (elephant safari) సఫారీ చేశారు. శనివారం అస్సాం (Assam)లో పర్యటిస్తున్న ప్రధాని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన కజిరంగ జాతీయ పార్క్‌ (Kaziranga National Park)ను సందర్శించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం సాయంత్రం మోడీ అస్సాంలోని తేజ్‌పుర్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక ఛాపర్‌లో గోలాఘాట్‌ జిల్లాలోని కజిరంగకు వచ్చారు. నిన్న రాత్రి జాతీయ పార్క్‌లోనే సేదతీరిన ఆయన.. ఈ తెల్లవారుజామున అభయారణ్యంలోని సెంట్రల్‌ కొహోరా రేంజ్‌ను సందర్శించారు. తొలుత ఏనుగు ఎక్కి విహరించిన ప్రధాని.. ఆ తర్వాత జీపులో సఫారీ చేశారు. సఫారీ అనంతరం ఏనుగులకు చెరకు గడలను తినిపించారు. ఈ అరణ్యంలోని ప్రకృతి అందాలను, జంతువుల చిత్రాలను ఆయన తన ప్రధానమంత్రి వెంట పార్క్‌ డైరెక్టర్‌ సొనాలీ ఘోష్‌, అటవీశాఖ సీనియర్‌ అధికారులున్నారు.  ఈ సందర్భంగా మహిళా ఫారెస్ట్‌ గార్డ్‌లతో ఆయన ముచ్చటించారు. ఈ చిత్రాలను మోడీ సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. ప్రతి ఒక్కరూ కజిరంగ నేషనల్‌ పార్క్‌ను సందర్శించి ఇక్కడి ప్రకృతి అందాలను వీక్షించాలని కోరారు.
ఈ మధ్యాహ్నం జోర్‌హట్‌లో కమాండర్‌ లచిత్‌ బర్ఫుకాన్‌ విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించనున్నారు. శౌర్యానికి ప్రతీకగా 125 అడుగుల ఎత్తులో ఈ విగ్రహాన్ని నిర్మించారు. అనంతరం రూ.18వేల కోట్లలతో నిర్మించనున్న కేంద్ర, రాష్ట్ర ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఆ తదుపరి బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.

Spread the love