వైకాపాకు మంత్రి గుమ్మనూరు రాజీనామా

నవతెలంగాణ – విజయవాడ: వైకాపాకు మరో బిగ్ షాక్‌ తగిలింది. ఆ పార్టీని వీడుతున్నట్లు మంత్రి గుమ్మనూరు జయరాం తెలిపారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ మేరకు ఆయన ప్రకటించారు. వైకాపా ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎమ్మెల్యే, మంత్రి పదవులకీ రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. నేడు మంగళగిరిలో తెదేపా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘జయహో బీసీ’ సభలో ఆ పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. సీఎం జగన్‌ విధానాలతో విసుగుచెందానని గుమ్మనూరు విమర్శించారు.

Spread the love