ప్రజాప్రతినిధులపై అకాంక్షతో..దీక్ష వాయిదా

– 41వ రోజు నిరాహార దీక్ష సాగించిన గూడెం బాధితులు 
నవతెలంగాణ – బెజ్జంకి 1
బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన మూడెకరాల భూ పంపిణీలో మాకు అన్యాయం జరిగిందని మండల పరిధిలోని గూడెం గ్రామానికి చెందిన పలువురు బాధితులు అవేదన వ్యక్తం చేశారు. సోమవారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ అవరణం వద్ద బాధితులు 41వ రోజు  నిరాహార దీక్ష సాగించారు. గత 40 రోజులుగా నిరంతరంగా నిరాహార దీక్ష చేస్తున్న అధికారులు స్పందించకపోవడం అసహనానికి గురిచేసిందని బాధితులు వాపోయారు.నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సంబంధిత అధికారులు న్యాయం చేస్తారనే అకాంక్షతో ఎన్నికల ప్రవర్తన నియమావళి నిబంధనల దృష్ట్యా తాత్కాలికంగా నిరాహార దీక్షను వాయిదా వేస్తున్నామని..ఎన్నికల అనంతరం నిరాహార దీక్షను యథావిధిగా చేపడుతామని బాధితులు తెలిపారు.
Spread the love