రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో వ్యాయమ ఉపాధ్యాయులకు సన్మానం

వ్యాయమ ఉపాధ్యాయులకు సన్మానం
వ్యాయమ ఉపాధ్యాయులకు సన్మానం
నవతెలంగాణ ఆర్మూర్ 

 రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా మంగళవారం క్రీడా దినోత్సవం పురస్కరించుకొని వివిధ మండలాలలోని ఉత్తమ సేవలందిస్తున్న వ్యాయామ ఉపాధ్యాయులను ముఖ్య అతిథి గా  డిప్యూటీ తాహశీల్దార్ విజయ్ కాంతారావు అధ్యక్షులు పట్వారి గోపి కృష్ణ ఆధ్వర్యంలో వారికి పూలమాల శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు.  ఈ సందర్భంగా డిప్యూటీ తహశీల్దార్ మాట్లాడుతూ విద్యార్థులు నిత్యం వ్యాయామం చేస్తూ ఆరోగ్యన్ని కాపాడుకోవాలి అని అన్నారు. గోపి కృష్ణ మాట్లాడుతూ ధ్యాంచంద్ ఆదర్శంగా తీసుకొని మంచి క్రీడాకారులు గా ఎదగాలని అన్నారు.ఈ కార్యక్రమంలో కార్యదర్శి పట్వారి తులసి కోశాధికారి లక్ష్మీనారాయణ ప్రాజెక్ట్ చైర్మన్ సురేష్, విద్యా ప్రవీణ్ పవర్, పద్మ మురళి ,విజయ సారథి ,చరణ్ రెడ్డి  సత్యం ,శశిధర్, ఉపాద్యాయులు పాల్గొన్నారు.
Spread the love