నవతెలంగాణ – హైదరాబాద్: గుజరాత్ టైటాన్స్ (జీటీ) కెప్టెన్ శుభ్మన్ గిల్కు భారీ జరిమానా పడింది. మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) తో చెపాక్ వేదికగా జరిగిన మ్యాచులో స్లో ఓవర్ రేట్ కారణంగా ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అతడికి రూ.12 లక్షల జరిమానా విధించింది. “మినిమమ్ ఓవర్ రేట్కు సంబంధించి ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం ఈ సీజన్లో అతని జట్టు చేసిన మొదటి నేరం కావడంతో గిల్కి రూ. 12 లక్షల జరిమానా విధించడం జరిగింది” అని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ తన ప్రకటనలో పేర్కొంది.