శివసత్తుల్ని గుర్తించండి

శివసత్తుల్ని గుర్తించండి– మంత్రి కొండా సురేఖకు సంఘం వినతి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆషాడ బోనాల నిర్వహణ నిమిత్తం ఏర్పాటు చేయబోయే ఉత్సవ కమిటీలో తెలంగాణ శివసత్తుల సంక్షేమ సంఘం సభ్యులకు ప్రాతినిధ్యం కల్పించాలని తెలంగాణ శివసత్తుల సంక్షేమ సంఘం ప్రెసిడెంట్‌ జోగిని కొలిపాక శ్యామల కోరారు. శుక్రవారంనాడామె సంఘం ప్రతినిధులతో కలిసి రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను సచివాలయంలో కలిసి, వినతిపత్రం సమర్పించారు. ఆషాడ బోనాల్లో ప్రజలు, శివసత్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వైభవోపేతంగా పండుగను నిర్వహించాలని, శివసత్తులకు ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేయాలని, సుదీర్ఘ కాలంగా బోనాల పండుగ వైభవాన్ని ప్రపంచానికి చాటుతున్న తెలంగాణ శివసత్తుల సంక్షేమ సంఘానికి ప్రభుత్వ గుర్తింపు ఇవ్వాలని కోరారు. పరిశీలించి, నిర్ణయం తీసుకుంటామని ఈ సందర్భంగా తెలిపారు.

Spread the love