కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. పేదల బతుకులు మారతాయి

– మాజీ ఎమ్మెల్యే అలిగి ప్రవీణ్ రెడ్డి
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే పేదల బతుకులు మారతాయని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అలిగి ప్రవీణ్ రెడ్డి అన్నారు. మంగళవారం హుస్నాబాద్ మండలంలోని పోతారం (ఎస్) గ్రామంలో పల్లె పల్లె కు కాంగ్రెస్ కార్యక్రమం నిర్వహించారు.కాంగ్రెస్ పార్టీ శ్రేణుల తో కలిసి మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఇంటింటా తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రాగానే నెరవేర్చ బోయే హామీలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు కేడం లింగ మూర్తి, సింగిల్ విండో చైర్మన్ బోలిశెట్టి శివయ్య, హుస్నాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బంక చందు, అక్కన్న పేట మండల అధ్యక్షులు జంగ పల్లి అయిలయ్య, పోతుగంటి బాలయ్య, గుడాట్ పల్లి సర్పంచ్ బద్దం రాజి రెడ్డి, వల్లపు రాజు, పూన్నా సది లావణ్య, మ్యాదర బోయిన శ్రీనివాస్, ఎగ్గిడి అయిలయ్య, గుర్రాల లింగా రెడ్డి, వెన్న రాజు, బూర్గు కీష్ట స్వామి, మాజీ ఎంపిటిసి బొమ్మ గానీ హరి బాబు పాల్గొన్నారు.

 

Spread the love