ఆ ఇద్దరినీ కలిపితే.. నేను

‘లక్ష్యం’, ‘లౌక్యం’ వంటి సూపర్‌ హిట్‌ సినిమాల తరువాత గోపీచంద్‌, డైరెక్టర్‌ శ్రీవాస్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న హ్యాట్రిక్‌ ఫిల్మ్‌ ‘రామబాణం’.
పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌ పై టీజీ విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిభొట్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో గోపీచంద్‌ సరసన నాయికగా డింపుల్‌ హయతి నటిస్తుండగా, జగపతిబాబు, కుష్బూ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీరామ నవమి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్‌ ఓ ప్రత్యేక పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. పండుగ వాతావరణాన్ని ప్రతిబింబించేలా గుడి ఆవరణంలో పంచె కట్టు, నుదుటన బొట్టుతో గోపీచంద్‌, జగపతి బాబు ఒకరి చేయి ఒకరు పట్టుకొని నడిచొస్తున్న పోస్టర్‌ తెలుగుదనం ఉట్టిపడేలా ఎంతో అందంగా ఉంది.ఈ పోస్టర్‌తోపాటు రిలీజ్‌ చేసిన ప్రత్యేక వీడియోలో,’ఆ రాముడుకి లక్ష్మణుడు, హను మంతుడు అని ఇద్దరు ఉంటారు. ఆ ఇద్దరినీ కలిపితే నేను’ అనే బలమైన డైలాగ్‌తో అందర్నీ ఆకట్టుకుంటోంది. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు సామాజిక సందేశం ఉన్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Spread the love