నేడు టీమిండియా-నేపాల్ మ్యాచ్.. ఓడితే ఇంటికే

నవతెలంగాణ-హైదరాబాద్: ఈ రోజు టీమ్ ఇండియా వర్సెస్ నేపాల్ జట్ల మధ్య కీలక పోరు జరగనుంది. ఆసియా కప్ టోర్నమెంట్ 20053లో భాగంగా టీమిండియా మరియు నేపాల్ జట్ల మధ్య ఐదవ మ్యాచ్ పల్లె కెళ్లే వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ప్రారంభం అవుతుంది. ఇక పాకిస్తాన్తో జరిగిన టీమిండియా మ్యాచ్ రద్దయిన సంగతి తెలిసిందే. దీంతో నేపాల్ జట్టుపై కచ్చితంగా టీమిండియా గెలవాల్సి ఉంటుంది. ఒకవేళ టీమిండియా ఓడిపోతే ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. మరి మనోళ్లు ఇవాళ ఎలా ఆడతారో చూడాలి.
టీమిండియా ఎలెవన్:
రోహిత్ శర్మ (సి), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
నేపాల్‌ XI:
కుశాల్ భుర్టెల్, ఆసిఫ్ షేక్ (WK), రోహిత్ పౌడెల్ (c), ఆరిఫ్ షేక్, సోంపాల్ కమీ, గుల్సన్ ఝా, దీపేంద్ర సింగ్ ఐరీ, కుశాల్ మల్లా, సందీప్ లామిచానే, కరణ్ ఛెత్రి, లలిత్ రాజ్‌బన్షి

Spread the love