నవతెలంగాణ – వరంగల్: వరంగల్లోని పోచమ్మ మైదాన్ జకోటియా షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సెకండ్ ఫ్లోర్లో మంటలు ఎగసి పడుతున్నాయి. రెండు ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. రెండు, మూడో ఫ్లోర్లకు మంటలు అంటుకున్నాయి. మంటలు ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. మంటలు ఇంకా అదుపులోకి రాకపోవడంతో చుట్టుపక్కల ఉండే స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా పక్క షాపులను కూడా పోలీసులు మూసేయిస్తున్నారు. కాగా ఘటన స్థలానికి ఇప్పుడే మంత్రి కొండా సురేఖ చేరుకున్నారు. అధికారులతో మంత్రి మాట్లాడుతున్నారు. వరంగల్ సెంటర్ పాయింట్లో ఘటనా స్థలం ఉండటంతో స్థానికులు భయపడుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.