నవతెలంగాణ – మాస్కో: రష్యా సర్కార్పై విమర్శలు చేస్తున్న వ్లాదిమిర్ కరా ముర్జాకు 25 ఏళ్ల జైలుశిక్ష విధించారు. దేశద్రోహం కేసులో అతనికి ఈ శిక్షను ఖరారు చేశారు. ఉక్రెయిన్ యుద్ధంపై విమర్శలు చేస్తున్న కేసులో అతన్ని అరెస్టు చేశారు. తనపై వచ్చిన ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. తాను రాసిన కథనాల పట్ల తానేమీ చింతించడం లేదని, గర్వంగా ఉందని అన్నారు. అధ్యక్షుడు పుతిన్కు కూడా వ్యతిరేకంగా విమర్శలు చేశాడు. రష్యా అధికారులు మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని, వారిపై చర్యలు తీసుకునేలా పాశ్చాత్య ప్రభుత్వాలపై వత్తిడి తెచ్చే విధంగా ముర్జా తన కథనాలను రాశారు.