కేసీఆర్ ఖమ్మం పర్యటన .. నేతల కాంగ్రెస్ బాట..

నవ తెలంగాణ – ఖమ్మం కార్పొరేషన్: అధికార బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. శుక్రవారం సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లా పర్యటనలో ఉండగానే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ స్థానిక 42వ డివిజన్ కార్పొరేటర్ పాకలపాటి విజయ నిర్మల, శేషగిరి దంపతులు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేశారు. బీఆర్ఎస్ నుంచి ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ గా విజయ నిర్మల విజయం సాధించారు. పాకలపాటి విజయ నిర్మల దంపతులు శుక్రవారం కాంగ్రెస్ నేత తుమ్మలను ఆయన కార్యాలయంలో కలిసి కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మి నారాయణ తదితరులున్నారు.

Spread the love