క‌ర్నాట‌క‌లో కూలిన కిర‌ణ్ శిక్ష‌ణ విమానం

నవతెలంగాణ – బెంగుళూరు: భార‌త వైమానిక ద‌ళానికి చెందిన కిర‌ణ్ శిక్ష‌ణ విమానం క‌ర్నాట‌క‌లో నేల‌కూలింది. చామ‌రాజ‌న‌గ‌ర్‌లోని మాకాలి గ్రామంలో ఆ విమానం క్రాష్ అయ్యింది. అయితే ఆ విమానంలో ఉన్న ఇద్ద‌రు పైలెట్లు క్షేమంగా ఉన్నారు. లేడీ పైలెట్ కూడా క్షేమంగా ఉన్న‌ట్లు అధికారులు చెప్పారు. ఈ ఘ‌ట‌న ప‌ట్ల విచార‌ణ‌కు ఆదేశించిన‌ట్లు ఐఏఎఫ్ అధికారులు వెల్ల‌డించారు.

 

Spread the love