కోహ్లి మరో రికార్డు

కోహ్లి మరో రికార్డు
కోహ్లి మరో రికార్డు

నవతెలంగాణ హైదరాబాద్:  టీమిండియా స్టార్‌ బ్యాట్స్ మెన్ విరాట్‌ కోహ్లి మరో రికార్డు సృష్ఠించాడు. ఆసియా కప్‌-2023లో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న సూపర్‌-4 మ్యాచ్‌లో ఆఫ్ సెంచరీ పూర్తి చేశాడు. దీంతో వన్డేల్లో అత్యధిక సార్లు 50 ప్లస్‌ స్కోర్లు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకాడు. నేటి మ్యాచ్‌తో వన్డేల్లో 112వసారి 50 ప్లస్‌ స్కోర్‌ (46 సెంచరీలు, 66 అర్ధసెంచరీలు) నమోదు చేసిన కోహ్లి.. ఆసీస్‌ దిగ్గజం రికీ పాంటింగ్‌ (112)తో సమంగా మూడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ (145) అగ్రస్థానంలో ఉండగా.. శ్రీలంక లెజెండ్‌ కుమార సంగక్కర (118) రెండో ప్లేస్‌లో ఉన్నాడు. ఈ జాబితాలో ప్రస్తుతం కోహ్లికి ముందు వీరిద్దరు మాత్రమే ఉన్నారు.
కోహ్లీ సెంచ‌రీ.. వ‌న్డేల్లో13 వేల ప‌రుగులు
విరాట్ కోహ్లీ(100) సెంచ‌రీ పూర్తి చేశాడు. షాహీన్ ఆఫ్రీదీ ఓవ‌ర్లో సింగిల్ తీసి శ‌త‌కం పూర్తి చేసుకున్నాడు. వ‌న్డేల్లో అత‌డికి 47వ శ‌త‌కం. అంతేకాదు విరాట్ వ‌న్డేల్లో 13 వేల ప‌రుగుల మైలురాయిని అందుకున్నాడు. కేఎల్ రాహుల్(108) క్రీజులో ఉన్నాడు. 48 ఓవ‌ర్లకు భార‌త్ స్కోర్.. 330/2
ఇదిలా ఉంటే, పాక్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు వరసపెట్టి హాఫ్‌ సెంచరీలు నమోదు చేస్తున్నారు. తొలుత రోహిత్‌ (56), శుభ్‌మన్‌ గిల్‌ (58).. ఇవాళ రాహుల్‌ (82 నాటౌట్‌), కోహ్లి (76 నాటౌట్‌) అర్ధశతకాలు నమోదు చేశారు. ఫలితంగా టీమిండియా 43 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 280 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్‌లో ఇంకా 7 ఓవర్లు మిగిలి ఉండటంతో ఈ మ్యాచ్‌లో భారీ స్కోర్‌ నమోదవ్వడం ఖాయంగా తెలుస్తుంది.

Spread the love