హీరో ఆది సాయికుమార్, దర్శకుడు వీరభద్రమ్ చౌదరితో ‘చుట్టాలబ్బారు’ వంటి మంచి చిత్రాన్ని చేసిన తర్వాత మళ్లీ విలేజ్ డ్రామా, ఫ్యామిలీ, లవ్, కామెడీ, ఫీల్ గుడ్ ఎమోషన్ ఇలా అన్ని అంశాలతో సినిమా చేస్తున్నారు. ఈ మూవీని లక్ష్మీ ప్రసన్న ప్రొడక్షన్స్ బ్యానర్ మీద తూము నరసింహా, జామి శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘కష్ణ ఫ్రమ్ బృందావనం’ అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. ఈ చిత్ర పూజా కార్యక్రమాలు గురువారం కాకతీయ హిల్స్లోని వెంకటేశ్వరుడి సన్నిధిలో ఘనంగా జరిగాయి. ముహూర్తపు షాట్కు దిల్ రాజు క్లాప్ కొట్టగా.. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఇక స్క్రిప్ట్ అందజేస్తూ కెమెరాను సాయి కుమార్ స్విచ్ ఆన్ చేశారు. హీరో ఆది సాయి కుమార్ మాట్లాడుతూ,’కుటుంబమంతా కలిసి చూసి నవ్వుకునేలా ఉంటుంది. జూన్ నుంచి షూట్ిం స్టార్ట్ చేయబోతున్నాం. నా గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమాకి కూడా అనూప్ రూబెన్స్ మంచి సాంగ్స్ ఇవ్వబోతున్నారు’ అని తెలిపారు. ‘ఇది ఆద్యంతం వినోదభరితంగా ఉంటుంది. హీరోయిన్ పాత్రకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. మా సినిమాను నిర్మాతలు తూము నరసింహా, జామి శ్రీనివాసరావు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు. చోటా కే ప్రసాద్ ఎడిటింగ్, రామ్ డైలాగ్స్, శ్యాం విజువల్స్ ఈ సినిమాకు హైలెట్గా నిలుస్తాయి. ఇది ఆదికి మరో మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవుతుంది’ అని దర్శకుడు వీరభద్రమ్ చౌదరి అన్నారు.