మిస్టర్‌ బచ్చన్‌ కీలక షెడ్యూల్‌ పూర్తి

మిస్టర్‌ బచ్చన్‌ కీలక షెడ్యూల్‌ పూర్తిరవితేజ, డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ కాంబోతో రూపొందుతున్న ‘మిస్టర్‌ బచ్చన్‌’ చిత్రం ఉత్తరప్రదేశ్‌లో 30 రోజుల సుదీర్ఘ షెడ్యూల్‌ను ముగించుకుంది. కీలక షెడ్యూల్‌ని విజయవంతంగా పూర్తి చేయడంతో దర్శకుడు హరీష్‌ శంకర్‌, చిత్ర బందం అయోధ్య ఆలయాన్ని సందర్శించి రామ్‌ లల్లా ఆశీస్సులు తీసుకున్నారు. దర్శకుడు ఆలయాన్ని సందర్శించిన దశ్యాలతో ఉన్న వీడియోను మేకర్స్‌ గురువారం విడుదల చేశారు. జగపతిబాబు కీలక పాత్రని పోషిస్తుండగా, రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్స్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌ పై టీజీ విశ్వ ప్రసాద్‌ ఈ ప్రాజెక్ట్‌ని గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. వివేక్‌ కూచిభొట్ల సహ నిర్మాత. మిక్కీ జే మేయర్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి నామ్‌ తో సునా హోగా అనేది ట్యాగ్లైన్‌.

Spread the love