అభినవ్ గోమటం టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘మై డియర్ దొంగ’. శాలినీ కొండెపూడి, దివ్య శ్రీపాద, నిఖిల్ గాజుల, వంశీధర్ గౌడ్, శశాంక్ మండూరి కీలక పాత్రలు పోషించారు. క్యామ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై గోజల మహేశ్వర్రెడ్డి నిర్మించిన ఈ చిత్రం తెలుగు ఓటీటీ మాధ్యమం ‘ఆహా’లో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రసాద్స్ ల్యాబ్లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రియదర్శి ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్ను లాంచ్ చేశారు. నిర్మాత మహేశ్వర్రెడ్డి మాట్లాడుతూ, ‘మై డియర్ దొంగ అంటే ఈ టీమ్లో శాలిని. ఆమె ఒక స్టోరీ రాసి, అందులో నటించడం అంటే చాలా గొప్ప విషయం. ఆమె ఒక డైరెక్టర్ను సెలెక్ట్ చేసుకుని ఈ ప్రాజెక్ట్ను ఇంత సక్సెస్ చేయడంలో ఆమే కీలకం. తర్వాత ఆహా ఈ ప్రాజెక్ట్లో కీలకంగా వ్యవహరించింది. మ్యూజిక్ ఈ సినిమాకు గ్రేట్ ఎసెట్. శాలిని, అభినవ్ మధ్య వచ్చే సన్నివేశాలు బాగా పండాయి’ అని తెలిపారు. ‘నా స్క్రిప్ట్ను, నా యాక్టింగ్ను ఆహా టీమ్ ఎంతగానో నమ్మారు. నాకు ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఇచ్చింది వాళ్లే. సినిమా రిలీజ్ అయ్యాక ఎలాంటి టాక్ వస్తుందో అని భయపడ్డా. కానీ ఇప్పుడే సక్సెస్ వైబ్స్ వస్తున్నాయి’ అని హీరోయిన్, రైటర్ శాలినీ చెప్పారు. ఆహా కంటెంట్ హెడ్ వాసు మాట్లాడుతూ, ‘డైరెక్టర్ సర్వాంగ పని తీరు చాలా బాగుంది. అభినవ్ క్రేజీనెస్ గురించి చెప్పాల్సిన పని లేదు. దొంగగా ఎవరు చేస్తే బాగుంటుందని శాలినీ, నేను అనుకున్నప్పుడు అభినవ్ పేరే వచ్చింది. ఈనెల 19న దీన్ని ఆహాలో చూడండి’ అని అన్నారు. ‘ఆహా టీమ్ అందరికీ థ్యాంక్యూ. ఫస్ట్ పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వాళ్లదగ్గర నుంచే వచ్చింది. శాలినీ, నేను పదేళ్ల నుంచి ఫ్రెండ్స్. ప్రియదర్శి నన్ను పెట్టి ఒక షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేశాడు. ఇప్పుడు శాలినీ స్క్రీప్ట్లో యాక్ట్ చేశా. ఆమె ఫస్ట్ ప్రాజెక్ట్ చాలా బాగా వచ్చింది’ అని హీరో అభినవ్ గోమటం చెప్పారు.