- Advertisement -
నవతెలంగాణ – ఉప్పునుంతల
ఉప్పునుంతల మండల కేంద్రంలో శుక్రవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) పుట్టినరోజు సందర్భంగా మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొత్త రవీందర్ రావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. అనంతరం హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద కేటీఆర్ చేపట్టిన దీక్షకు సంఘీభావం తెలుపుతూ ఉప్పునుంతల మండల కేంద్రం నుంచి పలువురు యువకులు బయలుదేరారు. ఈ సందర్భంగా శ్రీను, సుధాకర్, చిన్నా జంగయ్య, తాండ్ర శేఖర్, బాలస్వామి, వెంకటేష్, సయ్యద్, యాదగిరి తదితరులు హైదరాబాద్కు వెళ్లినట్లు మండల అధ్యక్షుడు కొత్త రవీందర్ రావు తెలిపారు.
- Advertisement -



