– సుమోటోగా కేసు నమోదు చేయాలి :కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం చైర్మెన్ ముత్తినేని వీరయ్య
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మరగుజ్జు వికలాంగులను కించపరిచే విధంగా మాట్లాడిన మంత్రి కేటీఆర్ వారికి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం చైర్మెన్ ముత్తినేని వీరయ్య శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. కేటీఆర్ మరుగుజ్జు అనే పదాన్ని వాడకూడదన్న ఇంగితాన్ని మరిచారని తెలిపారు. వారి మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడిన కేటీఆర్ తక్షణం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.