మాగుంట రాఘవ్‌ బెయిల్‌ విచారణ వాయిదా

నవతెలంగాణ- న్యూఢిల్లీ బ్యూరో
ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి కుమారుడు మాగుంట రాఘవ్‌ బెయిల్‌ విచారణ ఈ నెల 25కు వాయిదా పడింది. గురువారం రౌస్‌ అవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టు జడ్జి ఎంకె నాగ్‌పాల్‌ మాగుంట రాఘవ్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారించారు. పిటిషన్‌ విచారణకు వచ్చినప్పటికీ తీహార్‌ జైలు అధికారులు రాఘవ్‌ను వీడియో కాన్ఫరెన్స్‌లో హాజరు పరచలేదు. దీంతో తీహార్‌ జైలు సూపరింటెండెం ట్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాఘవ్‌ను శనివారం విసి ద్వారా హాజ రుపర్చాలని ఆదేశించారు. కేసు తదుపరి విచారణను 25కి వాయిదా వేశారు.మాగుంట రాఘవ్‌ బెయిల్‌ విచారణ వాయిదా

Spread the love