విశాఖ మార్గంలో నేడు, రేపు పలు రైళ్ల రద్దు

నవతెలంగాణ – విశాఖపట్టణం
విశాఖపట్టణం మార్గంలో నేడు, రేపు పలు రైళ్లను రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు. విజయవాడ డివిజన్‌లోని తాడి-అనకాపల్లి స్టేషన్ మధ్య గూడ్సు రైలు పట్టాలు తప్పింది. ఈ నేపథ్యంలో నేడు, రేపు కొన్ని రైళ్లను రద్దు చేశారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని అధికారులు కోరారు.

నేడు  రద్దైన రైళ్లు
– విజయవాడ-విశాఖపట్టణం (12718/12717)
– విశాఖపట్టణం-కడప (17488)
– హైదరాబాద్-విశాఖపట్టణం (12728)
– విశాఖపట్టణం-మహబూబ్‌నగర్ (12861)
– సికింద్రాబాద్-విశాఖపట్టణం (12740)
– విశాఖపట్టణం-తిరుపతి (22708)
– గుంటూరు-రాయగడ (17243)
నేడు, రేపు రద్దైన రైళ్లు ఇవే
– కడప-విశాఖపట్టణం (17487)
– విశాఖపట్టణం-హైదరాబాద్ (12727)
– మహబూబ్‌నగర్-విశాఖపట్టణం (12862)
– విశాఖపట్టణం-సికింద్రాబాద్ (12739)
– రాయగడ-గుంటూరు (17244)

Spread the love