తెలంగాణలో భారీగా ఎంపీడీవోల బదిలీ

నవతెలంగాణ – హైదరాబాద్‌: తెలంగాణలో ఎన్నికల బదిలీలు కొనసాగుతున్నాయి. పంచాయతీరాజ్‌ శాఖ పరిధిలోని 395 మంది ఎంపీడీవోలు బదిలీ అయ్యారు. సొంత జిల్లాలో పని చేస్తున్న వారితోపాటు మూడేళ్లకుపైగా ఒకే చోట పనిచేస్తున్న ఉద్యోగులను ఇతర జిల్లాలకు బదిలీ చేయాలని డిసెంబరులో ఎన్నికల సంఘం (ఈసీ) అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈసీ మార్గదర్శకాల మేరకు వివిధ శాఖలు బదిలీలు చేపట్టాయి.

Spread the love