రేపు కుటుంబ సమేతంగా అయోధ్యకు కేజ్రీవాల్‌

నవతెలంగాణ – ఢిల్లీ:  ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్‌ కేజ్రీవాల్‌ సోమవారం కుటుంబ సమేతంగా అయోధ్యకు వెళ్లనున్నారు. రేపు అరవింద్‌ కేజ్రీవాల్‌ కుటుంబంతో కలిసి అయోధ్యకు వెళ్తున్నారని, అయోధ్య రామయ్యను దర్శించుకోనున్నారని ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆదివారం వెల్లడించింది. కేజ్రీవాల్‌ కుటుంబంతోపాటు ఆప్‌ కీలక నేత, పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ సింగ్‌ మాన్ కూడా అయోధ్య రామయ్య దర్శనానికి వెళ్తున్నట్లు ఆప్‌ తెలిపింది. కాగా, అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరంలో గత నెల 22న శ్రీరాముడి ప్రాణప్రతిష్ట జరిగింది. ఆ మరుసటి రోజు నుంచి భక్తులు భారీ సంఖ్యలో రామయ్య దర్శనానికి తరలి వెళ్తున్నారు.

Spread the love