టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్థాన్

నవతెలంగాణ – హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్  17వ సీజన్ లో భాగంగా లక్నో సూపర్ జెంట్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటల ప్రాంతంలో ప్రారంభం కానుంది. లక్నో లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. రాజస్థాన్ రాయల్స్ ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్లలో ఏడు మ్యాచ్లలో గెలిచి పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో కొనసాగుతుంది.ఇక లక్నో సూపర్ జెయింట్స్ ఆడిన 8 మ్యాచ్లలో ఐదు మ్యాచ్లలో గెలిచి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది.ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ హాట్ ఫేవరెట్ గా ఉంది.
లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయింగ్ ఎలెవన్ : డికాక్, రాహుల్, స్టోయినిస్, పడిక్కల్, పూరన్, హుడా, బదోనీ, కృనాల్, హెన్రీ, బిష్ణోయ్, మోహ్సీన్
రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ ఎలెవన్ : యశస్వి, బట్లర్, సంజూ, పరాగ్, హెట్మయిర్, పావెల్, జురెల్, అశ్విన్, బౌల్ట్, ఆవేశ్, సందీప్

Spread the love