వేములవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడుగా ఎండీ రఫీక్..

నవతెలంగాణ – వేములవాడ
వేములవాడ ప్రెస్ క్లబ్ (టియుడబ్లుజే హెచ్ 143) అధ్యక్షుడిగా మహ్మద్ రఫీక్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మంగళవారం వేములవాడ లోజరిగిన ప్రెస్ క్లబ్ సర్వసభ్య సమావేశంలో అధ్యక్షుడిగా ఎండి రఫీక్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కే. నర్సయ్యలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడిగా ఎన్నికైన మహమ్మద్ రఫీక్ మాట్లాడుతూ నిరంతరం విలేకరుల సంక్షేమం కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. జర్నలిస్టులకు దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలపై ముందుండి పోరాటం చేస్తామన్నారు. త్వరలోనే ప్రెస్ క్లబ్ పూర్తిస్థాయి కార్యవర్గాన్ని ఎన్నుకుంటామన్నారు.  కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు లాయక్ పాషా, సీనియర్ జర్నలిస్టులు  తాహెర్ పాష, రేగుల రాంప్రసాద్, విలేకరులు రసూల్, శ్రీనివాస్, అలీ, జితేంద్ర, కనక రెడ్డి, శ్రీహరి, కమలాకర్, బోనాల రవి, వేణు, తోపాటు తదితరులు పాల్గొన్నారు.
Spread the love