గాండ్లగూడెంలో మెచ్చా క్రికెట్ లీగ్ టోర్నమెంట్…

– ప్రారంభించిన సీఐ బాలక్రిష్ణ
– ముఖ్య అతిథిగా ఎం.పి.పి శ్రీరామమూర్తి
నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట మండలం గాండ్లగూడెం లో మెచ్చా క్రికెట్ లీగ్ టోర్నమెంట్ ను మాలోత్ రామారావు నేతృత్వంలో నిర్వహిస్తున్నారు. ఈ పోటీలను గురువారం సీ.ఐ బాలక్రిష్ణ లాంచనంగా ప్రారంభించారు.అనంతరం ఎం.పి.పి శ్రీరామమూర్తి టాస్ వేసి క్రికెట్ పోటీలను ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉత్సాహంతో పాటు ప్రశాంతతను ఇస్తాయని అన్నారు.టోర్నమెంట్ విజేతలకు ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర రావు మొదటి బహుమతిగా రూ.40116 లు మొదటి బహుమతి అందజేస్తారు అనీ,రెండవ బహుమతి గా రూ. 20116 లు,మూడవ బహుమతి గా రూ. 12116 లు ప్రైజ్ మని మరియు సీల్డ్ ను,మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ బెస్ట్ ప్లేయర్స్ కు రూ.5116 లు అందజేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి వెంకన్న బాబు,మందపాటి రాజమోహన్ రెడ్డి,సర్పంచ్ భూక్యా చిలకమ్మా, డైరెక్టర్ భూక్యా ప్రసాద్,మాలోత్ ఆలీ బాబు,కే.నవీన్ నాయక్,హెచ్.వంశీ నాయక్, చందు,బీఆర్ఎస్ గ్రామ కార్యదర్శి మాలోత్ చంద్రకళ, బి పద్మ, చందా లక్ష్మీ నరసయ్య, ఫిరోజ్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.

Spread the love