హైదరాబాద్ : ప్రముఖ ఆటోమొబైల్ బ్రాండ్ ఎంజి మోటార్ ఇండియా శుక్రవారం హైదరా బాద్లో మూడు కొత్త టచ్ పాయిం ట్లను ప్రారంభించింది. కూకట్పల్లి, ఎల్బి నగర్లో 3500, 6000 చదరపు అడుగులలో రెండు డీలర్ షిప్లను, ఓ వర్క్షాప్ను ఏర్పాటు చేసినట్లు ఆ సంస్థ తెలిపింది. ఈ కొత్త టచ్ పాయింట్ల ప్రారంభంపై ఎంజి మోటార్ ఇండియా డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గౌరవ్ గుప్తా మాట్లాడుతూ.. ”2023 సంవత్సరం మాకు చాలా అద్భుతమైనది. మేం ఆటోమోటివ్ రంగంలో అంతర్జాతీయంగా ఒక శతాబ్దం పూర్తి చేసుకుం టున్నాం. తెలంగాణలోనే మొత్తం 16 టచ్ పాయింట్లు ఉన్నాయి. ఎస్యువిలు, ఇవిలకు తెలంగాణలో మంచి మార్కెట్ అవకాశాలున్నాయి.” అని అన్నారు. నగరంలో ఈ షోరూంలను ప్రారంభించడం ద్వారా, ఎంజి కార్లకు పెరుగుతున్న డిమాండును మేం తీర్చగలమని ఎంజి కూకట్పల్లి డీలర్ ప్రిన్సిపల్, రామ్4వీలర్స్ ఎండి అమిత్ రెడ్డి పేర్కొన్నారు. ”హైదరాబాద్లో ఎంజీతో మా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడం సంతోషంగా ఉంది.” అని ఎంజి ఎల్బి నగర్ డీలర్ ప్రిన్సిపల్, పిపిఎస్ మోటార్స్ ఎండి రాజీవ్ సంఘీ అన్నారు.