ఉపాదీ హమీ కూలీల వద్ద ఎమ్మెల్యే ప్రచారం

నవతెలంగాణ – జుక్కల్
ఎలక్షన్స్ ప్రచారంలో భాగంగా బుదువారం నాడు మహ్మదాబాద్ గ్రామంలో ఉపాధి హామీ కూలీల దగ్గరికి వెళ్లి వారి సమస్యలు తెలుసుకున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు. ఈ సంధర్భంగా ఎమ్మెలే మాట్లాడుతు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేక ఉపాధి హామీ చట్టం తీసుకొచ్చి దినసరి కూలీ రూ. 400 చేస్తుందని చెప్పారు..అందుకోసం మీరందరూ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ షెట్కార్ గారిని గెలిపించాలని కోరారు.b మహ్మదాబాద్ గ్రామంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు ఎమ్మేల్యే తోట లక్ష్మీ కాంతారావు గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Spread the love