నవతెలంగాణ-కోహెడ
మండలంలోని గుండారెడ్డిపల్లి గ్రామంలో మంగళవారం సీసీ రోడ్డు పనులకు ఎంపీపీ కొక్కుల కీర్తి సురేష్ భూమిపూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్థికమంత్రి తన్నీరు హరీశ్రావు, ఎమ్మెల్యే వొడితెల సతీష్కుమార్ల సహాకారంతో ఎంపీటీసీ సుతారి కణ్యాణి కనకయ్య సూచన మేరకు డీఎంఎఫ్టీ నుండి 10 లక్షల నిధులు మంజూరైనట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో గ్రామాలు, మండలాలు అభివృద్ధి చెందుతున్నాయని, రాబోయేఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ గెలుపొందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఓరుగంటి అశోక్రెడ్డి, ఉపసర్పంచ్ వార్డు సభ్యులు, గ్రామస్తులు, తదితరులు, పాల్గొన్నారు.