నవతెలంగాణ – అమరావతి : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ..కూటమి అధికారంలోకి రాగానే అమరావతి రాజధాని పనులు ప్రారంభిస్తామని చెప్పారు. 2019 నుంచి అమరావతి పనులు కొనసాగించి ఉంటే లక్ష మందికి ఉపాధి అవకాశాలు లభించి ఉండేవని నారా లోకేశ్ తెలిపారు. 2014లో అమరావతికి జగన్ సంపూర్ణ మద్దతు తెలిపారని, కానీ అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులు అంటూ మూడు ముక్కలాట ఆడారని విమర్శించారు.