నవతెలంగాణ ముంబై: ఎన్సీపీలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్సీపీని చీల్చి మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరిన అజిత్ పవార్ వైపు నిలిచిన ఇద్దరు ఎంపీలను పార్టీ నుంచి తొలగిస్తున్నట్టు శరద్పవార్ ప్రకటించారు. అయినా శరద్ పవారే తమ పార్టీ జాతీయ అధ్యక్షుడంటూ అజిత్ పవార్ వ్యాఖ్యానించడం గమనార్హం. ఎంపీలు సునీల్ తట్కరే, ప్రఫుల్ పటేల్ను ఎన్సీపీ నుంచి నుంచి తొలగిస్తున్నట్టు ఈ సాయంత్రం శరద్ పవార్ ట్విటర్లో ప్రకటించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందున వారిద్దరినీ పార్టీ తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసినట్టు పేర్కొన్నారు.