సరికొత్త కాంబినేషన్‌

శింబు కథానాయకుడిగా కమల్‌ హాసన్‌ రాజ్‌ కమల్‌ ఫిలింస్‌ ఇంటర్నేషనల్‌ ఎస్‌టిఆర్‌48 చిత్రాన్ని అనౌన్స్‌ చేసింది. కమల్‌ హాసన్‌, ఆర్‌.మహేంద్రన్‌ నిర్మించనున్న ఈ చిత్రానికి రచన, దర్శకత్వం దేశింగ్‌ పెరియసామి. ‘కన్నుమ్‌ కన్నుమ్‌ కొల్లైయాడితాల్‌’ విజయం తర్వాత పెరియసామి మరో అద్భుతమైన కథతో వస్తున్నారు. ఇది రాజ్‌ కమల్‌ ఫిలింస్‌ ఇంటర్నేషనల్‌ 56వ ప్రొడక్షన్‌. కమల్‌ హాసన్‌ కథానాయకుడిగా, మణిరత్నం దర్శకత్వంలో కెహెచ్‌ 234, అలాగే రాజ్‌కుమార్‌ పెరియసామి దర్శకత్వం వహించిన శివకార్తికేయన్‌, సాయి పల్లవి నటిస్తున్న సోనీ పిక్చర్స్‌తో పాటు ఆర్‌ఎఫ్‌ఐ51తో సహా అద్భుతమైన చిత్రాలు వరుసలో ఉన్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు, నిర్మాత కమల్‌ హాసన్‌ మాట్లాడుతూ, ‘శ్రేష్టమైన చిత్రాలను అందించడం రాజ్‌ కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ లక్ష్యం. గత 40 ఏళ్లుగా మా సామర్థ్యాల మేరకు దీన్ని చేస్తున్నాం. మనలాంటి లక్ష్యాలను సాధించే వ్యక్తుల కోసం మేం ఒక వేదికను అందించాలనుకుంటున్నాం. పరిశ్రమలో విజయం సాధించడం మాకు చాలా ముఖ్యం. శింబు, దేశింగ్‌ పెరియసామి టీమ్‌కి ఆల్‌ ది బెస్ట్‌’ అని చెప్పారు.

Spread the love