ఎన్నికల విధులలో అధికారులు..

– ప్రభుత్వ భూముల కబ్జాల్లో  దళారులు
– కబ్జాదారులకు కలిసోచ్చిన ఎన్నికల సమయం
నవతెలంగాణ-బోడుప్పల్: ఎన్నికల డ్యూటీలో  అధికారులు బీజిగా ఉండడం ప్రభుత్వ భూముల కబ్జా చేసే దళారులకు బాగా కలిసి వచ్చింది. ఎన్నికల విధులలో బిజీగా ఉండడంతో బోడుప్పల్ లో ప్రభుత్వ భూములను కబ్జాలకు యుదేచ్చగా పాల్పడుతున్నారు.వివరాల్లోకి వెళితే బోడుప్పల్ నగర పాలక సంస్థ పరిధిలోని సర్వే నెంబరు 63/28 నుండి 63/38 వరకు గల ప్రభుత్వ భూమిలో కొందరు దళారులు తప్పుడు ద్రవ పత్రాలతో పేదలకు ప్లాట్లు అమ్మడం రాత్రికి రాత్రే నిర్మాణాలు చేయడం జరుగుతుంది. ఈ కబ్జాల వెనుక రాజకీయ పార్టీలకు చెందిన నేతలు ఉండడం కబ్జాదరులకు కలిసి వస్తుంది.మరీ ఇప్పటికైన రెవెన్యూ అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటారా వేచి చూడాలి.
Spread the love