ఓకే ప్రాంగణం… రెండు పాఠశాలలు…

– 279 మంది 10 మరుగు దొడ్లు….
– అసౌకర్యాలు నడుమ ఆశ్రమ విద్యార్ధులు…
నవతెలంగాణ – అశ్వారావుపేట: విద్యకు అత్యధిక నిధులు కేటాయిస్తే ఉన్నాం. విద్యార్ధుల సమగ్ర విద్యాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం అంటూ ప్రభుత్వాధినేతలు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తారు.కోట్లు హెచ్చరించి పత్రికల్లో ప్రకటనలు గుప్పిస్తారు. కానీ క్షేత్ర స్థాయిలో మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంటుంది. నలుగురు ఉండే ఇంట్లోనే అదనంగా ఒక్కరు బస చేయాలన్నా ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో అందరికీ తెలిసింది. అయితే 250 మంది విద్యార్ధులు కోసం నిర్మించిన వసతి గృహంలో రెండు వసతి గృహాలు విద్యార్ధులకు వసతి అంటే ఎలా ఉంటుందో ఊహించండి. ఇక విషయంలోకి వేస్తే… మండల పరిధిలోని సున్నం బట్టి లో గిరిజన సంక్షేమ శాఖ విద్యా విభాగం ఆద్వర్యంలో 250 మంది విద్యార్ధులకు సరిపడా సౌకర్యాలతో కూడిన ఆశ్రమ ఉన్నత పాఠశాల ఉంది. ఈ పాఠశాలలో 250 మందికి గాను 1వ తరగతి నుండి 10 వ తరగతి వరకు 118 మంది విద్యార్ధులు చదువుతున్నారు.ఇందులో 103 మంది విధ్యార్ధులు వసతి పొందుతున్నారు. మిగత 15 మంది ప్రైమరీ పాఠశాల విద్యార్ధులు. ఇదే పాఠశాల ప్రాంగణంలోకి గతేడాది పెద్దవాగు ప్రాజెక్ట్ ఆశ్రమ పాఠశాలను తరలించారు. ఈ పాఠశాల నిర్వహణ కోసం సున్నంబట్టి పాఠశాలకు చెందిన భావన సముదాయాన్ని విభజించారు. ఈ పాఠశాల విధ్యార్ధులు కోసం 6 గదులు కేటాయించారు.ఈ పాఠశాలలో 250 మందికి గాను 6 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు 172 మంది విద్యార్ధులు వసతి పొందుతున్నారు.
వీరందరికి సరిపడా నివాస గదులు, స్నానాలు గదులు, మరుగు దొడ్లు లేకపోవడంతో నానా ఇక్కట్లకు గురి అవుతున్నారు. ఈ విద్యార్ధులకు వంట గది సైతం లేకపోవడంతో ఆరుబయటే వంట నిర్వహిస్తున్నారు. ఈ రెడు పాఠశాలల 279 మంది విద్యార్ధులకు 10 మెరుగు దొడ్లు మాత్రమే ఉండటం విచారకరం. ఈ అసౌకర్యాలు గురించి ఇరు పాఠశాలల ఉపాధ్యాయులు కాంతయ్య,బాలు లను వివరణ కోరగా అసౌకర్యాలు పరిష్కారం కోసం ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలుపూ తూనే ఉన్నాం అని, ఇటీవల వారం క్రితం ఈ ఐటిడిఎ పి.ఓ ప్రతీక్ జైన్ ఈ పాఠశాలను సందర్శించినప్పుడు సైతం ఈ విషయాన్ని తెలిపాము అని అన్నారు.

Spread the love